Kamal Haasan : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నేను సైతం అంటూ జాయిన్ అయ్యారు కమల్ హాసన్. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర ఢిల్లీలో కొనసాగుతోంది. ఎర్రకొట వద్ద ఏర్పాటు చేసిన జోడో యాత్ర సభలో కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడిది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో కమల్.. కాంగ్రెస్తో జట్టు కట్టనున్నారా అనే చర్చ నడుస్తుంది.
తాను ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలా మంది ప్రజలు డౌట్ పడుతున్నారు. తన తండ్రి కాంగ్రెస్ వాది అని.. తాను ప్రత్యేక పార్టీ పెట్టినప్పటికీ దేశం కోసం ఇక్కడికి వచ్చానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. నా పోరాటం, నా పొలిటికల్ కెరీర్ అంతా దేశం కోసమే అన్నారు ఆయన. విపక్షాలన్నీ ఏకతాటి పైకి రావాలని.. కలిసి పని చేయాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను చూసి..ప్రధాని మోడీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో ఎందుకు చర్చించడం లేదని ధ్వజమెత్తారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. అప్పుడు మాస్క్ పెట్టుకోలేదని.. కానీ పార్లమెంట్లో మాత్రం మాస్క్ పెట్టుకుని అందరికీ చూపించాని ఖర్గే సెటైర్లు వేశారు.