EPAPER
Kirrak Couples Episode 1

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు దుండగులు. ఈ దోపిడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భనుతి ఎస్బీఐ శాఖలో జరిగింది.


దుండగులు పక్కా ప్లాన్‌తో భనుతి శాఖ బయటి నుంచి బ్యాంకులోనికి 10 అడుగుల సొరంగం తవ్వారు. బ్యాంకు కార్యాలయంలో ఎవ్వరూ లేని సమయంలో లోపలికి వెళ్లి సుమారు రూ.కోటి విలువ చేసే 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు.

బ్యాంకులోంచి మొత్తం ఎంత దోపిడీ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. అయితే బ్యాంకు దోపిడీ సమయంలో అక్కడ రూ.34 లక్షల క్యాష్ ఉన్నా దాన్ని దొంగలించడానికి వారికి వీలుపడలేదుని పోలీసులు తెలిపారు. లభ్యమైన కొన్ని ఆధారాల ద్వారా దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నామన్నారు డీజీపీ విజయ్ డూల్.


బ్యాంకు నిర్మాణం పనులు బాగా తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను రంగంలోకి దించామన్నారు సీపీ బీపీ జోగ్దండ్.

Tags

Related News

Mithun Chakraborty: మిథున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్.. కమల కటాక్షమేనా?

Bomb Threat: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అలర్ట్ అయిన అధికారులు

Nirmala Sitharaman: ఆ స్కీమ్ వెనుక భారీ అవినీతి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు!

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Big Stories

×