EPAPER

Etela: నేనే బహిరంగ క్షమాపణలు చెప్పి.. ముక్కు నేలకు రాస్తా: ఈటల

Etela: నేనే బహిరంగ క్షమాపణలు చెప్పి.. ముక్కు నేలకు రాస్తా: ఈటల

Etela Rajendhar Serious Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల విషయమై ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.


‘నీకు దమ్ముంటే .. నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొడుతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా..? ఒకరోజు,రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం.శభాష్ రేవంత్ రెడ్డి.. మీరు చేస్తున్నది మంచి పనే అని ఎవరైనా అంటే అంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సకరంగా మాట్లాడుతున్నారు.

కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టీ.. సన్నాసులు, పిచ్చికుక్కలు కరిచిపోతారు అని మాట్లాడుతున్నారు. బతకొచ్చిన వాడు అని మాట్లాడుతున్నారు. చదువుకుంటే సంస్కారం వచ్చేది, ఇతరులు చెప్పేది వింటే జ్ఞానం వస్తుండే. నేను చదువుకుంది కేశవ్ మెమోరియల్ స్కూల్. నా జూనియర్ కాలేజీ అలియా జూనియర్, గన్ఫౌండ్రి. డిగ్రీ కాలేజీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ. నా బిజినెస్ అంతా ఇక్కడే. నన్ను పట్టుకొని బతుకొచ్చినవాడు అంటున్నాడు. నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గు పడుతుంది.


Also Read: మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏమన్నారంటే..?

మల్కాజిగిరి ప్రజలు నిన్ను గెలిపిస్తే మొఖం చూడకుండా మోసం చేశావు. ఒక్కనాడన్నా నిలబడి పని చేయలేదు. మంత్రిగా పనిచేసి ఉంటే సిస్టమ్ తెలిసేది. నీళ్ల మీద దెబ్బలు కొట్టినట్టు పనిచేశారు. అబద్దాల పునాల మీద బ్రతికారు. బ్రోకర్ మాటల మీద బ్రతుకుతావు తప్ప ప్రజలకు సేవ చేయలేదు అని ప్రజలే అంటున్నారు.

నేను కానీ మా పార్టీ గాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు. చెరువులు బాగుచేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు. పేదలకు ఇల్లు కట్టించడానికి, మూసి ప్రక్షాళనకు, చెరువులను కొబ్బరినీళ్ళ లెక్క చేస్తానన్నా వ్యతిరేకం కాదు. మేము అడిగేది.. ఆరు గ్యారెంటీలు, 66 హామీలు, 420 పనులు చేస్తామని చెప్పారు..రైతుల కోసం వరంగల్ లో రాహుల్ గాంధీ చేత, సోనియాగాంధీ చేత, ప్రియాంక గాంధీ చేత, ఖర్గేగారి చేత గ్యారెంటీల సభలు పెట్టారు. ఆరు గ్యారెంటీలలో ఒక్క పని కూడా చేయలేదు. మహిళాపాలసీలో ఆర్టీసీలో ఉచిత బస్సు తప్ప రూ. 2500 ఇవ్వలేదు. తులంబంగారం ఇవ్వలేదు. రూ. 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. రైతులారా వెంటనే రుణం తీసుకోమని చెప్పారు..కానీ, వారికి రుణమాఫీ చేయలేదు. రూ. 500 రూపాయల బోనస్, రూ. 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, రూ. 18 వేల రైతు భరోసా, కౌలురైతులకు డబ్బులు, రైతు కూలీలకు రూ. 12 వేల రూపాయలు ఏది కూడా ఇవ్వలేదు.

తేమ్స్, సబర్మతి, గంగాప్రక్షాళన అని మాట్లాడుతున్న మీరు.. రూ. 1,50,000 కోట్లు మూసీ నదికోసం కేటాయిస్తాం అని చెప్తున్నారు. తెలివి ఉందా లేదా ? సమాచారంతో మాట్లాడండి. సబర్మతి రివర్ ఫ్రంట్ కి రూ. 1400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2511 కిలోమీటర్లు గంగా ప్రక్షాళన కోసం.. 50 కోట్ల జనాభాను తాకే ప్రాజెక్ట్ గంగానమామి కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారు. మరి మూసీ కోసం నువ్వు ఖర్చుపెట్టేది రూ. 1.5 లక్షల కోట్లా?

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. దవాఖానాలలో మూడు నెలలుగా మందులు లేవు. మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలలో పనిచేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు ఇవ్వకపోతే చచ్చిపోతామని వారంతా చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రావడం లేదు. ఆర్టీసీకి ఇచ్చిన రూ. 280 కోట్ల చెక్కు బౌన్స్ అయింది. ఈ రాష్ట్రం అప్పుల ఊబీలో
కూరకుపోయిందని, అసెంబ్లీ వేదికగా చెప్పారు. నెలకు రూ. 7 వేల కోట్ల డబ్బులు కట్టే పరిస్థితి వచ్చిందని మీరే చెప్పారు. తెచ్చుకున్న అప్పుకే వడ్డీలు కట్టే పరిస్థితి లేదు.. ఆర్థిక పరిస్థితి నాశనమైందని ఇవ్వాలనుకున్న కూడా ఇవ్వలేక పోతున్నా అని చెప్తున్న మీరు ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాగలరు చెప్పగలరా ?

Also Read: ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం.. ఇదే మీ ఆధారం, రక్షణ కవచం కూడా

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలు అయింది అన్నారు. మిషన్ భగీరథ పేరిట నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులు కేసీఆర్ తిన్నారని మీరు చెప్పారు. ఒక రాష్ట్రం అప్పు తేవాలంటే జిఎస్డిపిలో 25% కంటే ఎక్కువ దాటకూడదు కానీ,ఇప్పటికే దాటింది. మళ్లీ కొత్తగా రుణం వచ్చే అవకాశం లేదు. మరి మూసీ ప్రక్షాళన కోసం ఎలా తీసుకొస్తారు? నీ రోడ్డు మ్యాప్ ఏంటి ? డిపిఆర్ ఏంటి ? ఎప్పటినుంచి ఎప్పటి వరకు పూర్తి చేస్తావు ?దేనికి ఎంత ఖర్చవుతుంది ? ఎవరు దీనికి కాంట్రాక్టర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా?

కేసీఆర్ నిజస్వరూపం తెలవడానికి ఆరు సంవత్సరాలు పడితే.. రేవంత్ రెడ్డి ఆరు నెలలకే బయటపడ్డారు. కేసీఆర్ ను నిలవరించే సత్తా ప్రజలకు మాత్రమే ఉంది అనుకున్నాము ఆయన్ని బొందపెట్టారు. రేవంత్ రెడ్డి నిజ స్వరూపం మీరు చూశారు. అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.. అబద్ధాలు ఆడే నాయకున్ని ప్రజలు ఇష్టపడతారు.. మోసం చేసే పార్టీలకే ఓటు వేస్తారు అన్నారు. మోసం అబద్ధాలకు మారుపేరు రేవంత్. పచ్చకామెర్లు ఉన్నవాడి లాగా మమ్మల్ని సన్నాసులు అంటున్నారు.

హరీష్ రావు రాసిస్తే ఈటల చదువుతున్నారు అని రేవంత్ మాట్లాడుతున్నారు. నీకేమన్న జ్ఞానం ఉందా? నీకు కొన్ని వందల స్పీచ్ లు ఉంటాయి. ఒకసారి అసెంబ్లీ వెబ్సైట్లోకి వెళ్లి చూడండి. మోడీ గీడీ అన్నవాడు ఎటు పోయాడో చూశాం. ప్రొటోకాల్ ఇష్యూపై పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా.

మంత్రులు మాట్లాడే భాషలు రాజకీయ నాయకులుగా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చారు. సంస్కారమతంగా దేవుడు ఎరుగు చాలా వినకూడని సిగ్గుపడే భాష ఉంది. ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటం ఎటుపోతుందో చూడాలి. అరాచక పద్ధతిలేని వారిని కట్టడి చేసే బాధ్యత ప్రజలకే ఉంటుంది. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను అచ్చం తెలంగాణ మట్టి బిడ్డను.నన్ను బ్రతకవచ్చినాడు అంటే ఇంకా నేనే మాట్లాడాలి’ అంటూ ఈటల సీరియస్ అయ్యారు.

Also Read: కన్నీరు రానివ్వము కానీ.. ఆ పార్టీ మాటలు నమ్మొద్దు – మంత్రి తుమ్మల

Related News

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

CM Revanth Reddy: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

Big Stories

×