Rama Namam:అసాద్యమనుకున్న కార్యాలను కూడా సాధించి పెట్టేది తంత్ర ప్రయోగం. ఈ తంత్ర ప్రయోగాన్ని శుభ తిధి ఉన్నఆదివారం నాడు మొదలుపెట్టి, వరుసగా 29 రోజులపాటు, అంటే తరువాత వచ్చే 5వ ఆదివారం వరకు చేయాలి. ఈ తంత్ర ప్రయోగం ఒక్క సారికి మత్రమే, ఒక్క కోరికను, ఒక్క కార్యాన్ని సాదించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆదివారం పూట తెల్లవార జామున లేచి స్నానం చేసి, పూజ చేసే చోట కూర్చుని, ఒక గుప్పిట వడ్ల గింజలను తీసుకుని రామయ్యా రామ చంద్రా యా, జానకి ప్రాణ వల్లభాయా, అపద్దుదరాకాయా స్వాహః అన్న మంత్రాన్ని జపిస్తూ మీరు సాదించాలనుకుంటున్న కార్యాన్ని, నేరవేరాలనుకుంటున్న కోరికను మీ మనస్సులో తలుచుకుంటూ, గుప్పిట వడ్లనూ వలచి, బియ్యం జాగ్రత్తగా ఒక డబ్బాలో వేయండి.. ఇలా ప్రతిరోజు శనివారం వరకు చేయాలి.
మొదటి ఆదివారం నుండి మొదటి శనివారం వరకు వలచిన బియ్యాన్ని, రెండో ఆదివారం నాడు తెల్లవారి, మొత్తం బియ్యాన్ని దంచి పొడి చేసుకుని, చలిమిడి చేసి, శ్రీ సీతారాముల పట్టాభిషేకం చిత్ర పటం ముందు నివేదన చేయాలి. రకరకాల పుష్పాలను స్వామికి సమర్పించి, ధూపం వేసి, దీపం వెలిగించి విశేష పూజ చేయాలి. ఇదే విధంగా రెండో ఆదివారం నుంచి తర్వాత రెండవ శనివారం వరకు వలచిన బియ్యంతో మూడవ ఆదివారం నాడు విశేష పూజ చేయండి. ఇదే పద్దతిలో నాలుగో ఆదివారం నాడు, ఐదో ఆదివారం రోజు విశేష పూజ చేసారంటే ఈ తంత్ర ప్రయోగం పూర్తయినట్లే. మొత్తం 29 రోజుల పాటు ఈ పూజ చేయాలి.
ఇంత సమయం పాటు మంత్రం చెప్పాలి, మంత్రం ఇన్ని సార్లు చెప్పాలన్న నియమం ఏదీ లేదు. కానీ ఒక గుప్పెట వడ్ల గింజలను వలిచి బియ్యం తీసేంత వరకు మంత్ర జపం చేస్తే చాలు. మీరు ఒకే కోరిక కోరుకుని, భక్తి శ్రద్దలతో చేశారంటే, అసాధ్యమని సుసాధ్యం అవుతుంది. అనుకున్న పని తప్పక నెరవేరతాయని శాస్త్రం చెబుతోంది.