Parliament : పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందే ముగిశాయి. సంక్రాంతి వేడుక, న్యూ ఇయర్ కావడంతో ముందుగానే ముగించారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో 97 శాతం పనితీరు సాధించినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 29 వరకు ఈ సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొన్ని రోజులకే చైనా-భారత్ మధ్య ఘర్షణ విషయం బయటకి వచ్చింది. చైనా భారత్పై మరో సారి దాడికి పాల్పడిన అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ స్పీకర్ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ.. విపక్షాల తీరు వల్ల సభలో ఒక గంట 45 నిమిషాలు వృధా అయ్యిందని ఆయన అన్నారు.