YS Jagan : చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాన్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబులా ఈ రాష్ట్రం కాకపోతే వేరే రాష్ట్రం.. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే ఇంకో భార్య అని నేను వ్యాఖ్యలు చేయను అని సీఎం జగన్ అన్నారు.
ఈ రా వైఎస్సార్ జిల్లా.. కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఉన్నానని.. వీరే నా కుటుంబం అని అన్నారు ముఖ్యమంత్రి జగన్.
‘రాష్ట్రంలో మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నేను దేవుడిని, ప్రజల్నే నమ్మా..కానీ ఎవ్వరినీ నమ్ముకోలేదు’ అని అన్నారు. జనవరిలో కడప స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభమవుతాయన్నారు. జిందాల్ స్టీల్తో మాట్లాడి కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఒప్పందం చేసుకున్నామన్నారు.