ISRO Shukrayaan 1 Mission: ‘మిషన్ శుక్రయాన్’ సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి 112 రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ మిషన్ పేర ‘వీనస్ ఆర్బిటర్ మిషన్(వీఓఎం)’ శుక్రగ్రహంపైకి భారత్ వ్యోమ నౌకను పంపడం ఇదే తొలిసారి.
శుక్ర గ్రహంపై పరిస్థితులు, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడం దీని ప్రధాన లక్ష్యం. అయితే ఇందు కోసం రూ.1,236 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అన్ని సవ్యంగా కుదిరితే 2028 మార్చి 29న శుక్రయాన్ 1 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. ఇస్రోకు చెందిన శక్తివంత ఎల్వీఎం 3 చెందిన లాంచ్ వెహికల్ మార్క్ రాకెట్ను దీనికి ఉపయోగించనున్నారు.
అయితే, దీనిని ప్రయోగించిన 112 రోజుల తర్వాత 2028 జూలై 19న ఈ వ్యోమనౌక శుక్రుడి ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇస్రోకు ఇది పెద్ద విజయం కానుంది.
Also Read: పెద్ద డిస్ప్లేతో ఇండియాలోకి సామ్ సాంగ్ స్పెషల్ ఎడిషన్ – ప్రీ ఆర్డర్, స్పెసిఫికేషన్స్ లీక్
సింథటిక్ అపెర్చర్ రాడార్, ఇన్ఫ్రారెడ్, అతినీలలోహిత కెమెరాలు, సెన్సర్లతో సహా అత్యాధునిక పరికరాలను శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌక ఆర్బిటర్కు పంపనుంది. శుక్రుడి రహస్యాలను ఛేదించడానికి, గ్రహం ఉపరితంలపై పరిస్థితులను అన్వేషించడానికి ఈ పరికరాలను శస్త్రవేత్తలక సహాయపడనున్నాయి.