Mahabubabad : మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని చేలల్లో పని చేస్తున్న అన్నదాతల వద్దకు వెళ్లు పూలమాలలు వేసి, సన్మానించారు. రైతుల గొప్పదనాన్ని చాటుతూ నినాదాలు చేశారు.
జై కిసాన్, రైతే దేశానికి వెన్నుముక, అన్నం పెట్టే రైతన్నకు జై అంటూ ప్రేమను చాటుకున్నారు. ఎడ్ల బండ్లపై పంట పొలాలకు వెళ్లే రైతులకు సెల్యూట్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న రైతుల్ని. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.