Railway Coach Factory : తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే కోచ్ల తయారీ సామర్థ్యం ప్రస్తుత ఫ్యాక్టరీలకు ఉందని వెల్లడించింది.
రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు సరిపడా కోచ్ల తయారీ స్థాపిత సామర్థ్యం ఉందని కేంద్రం తేల్చిచెప్పింది.