Coronavirus Recovery : కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువ మంది నీరసంగా ఉంటున్నారు. కరోనా రోగ నిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం చూపించింది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నా నీరసంగా ఉంటే శక్తివంతమైన, పోషకాలు ఉన్న ఆహారం తినాలి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, బీన్స్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. అంతేకాకుండా విటమిన్లు, సీ,డీలతో పాటు జింక్, మినరల్స్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. దీంతో నీరసం తగ్గుతుంది. అంతేకాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.
ఎల్లప్పుడూ తాజా ఆహారపదార్థాలను తినాలి, సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది. ఆరెంజ్ను ఎక్కువగా తినాలి. ప్రతిరోజు నట్స్ తినాలి. రాత్రి బాదంపప్పు నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. కిస్మిస్లు నానబెట్టి తినాలి, వాల్నట్స్, ఖర్జూరాలు కూడా తరచూ తినాలి. పోషకాహారంతో పాటుగా వ్యాయామం కూడా చేయాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఉదయం త్వరగా నిద్రలేవాలి, రాత్రి తొందరగా పడుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో శక్తిస్థాయిలు పెరిగి ఉత్సాహంగా ఉంటారు.
అంతేకాకుండా బయటికి వెళ్లినప్పుడు మాస్క్లు ధరించాలి, భౌతికదూరం పాటించాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేట్, బీపీ ఎప్పుడూ చెక్చేసుకుంటుండాలి. షుగర్ ఉన్నవారు లెవల్స్ను కంట్రోల్లో ఉంచుకోవాలి.