Sikkim : సిక్కింలో ఆర్మీ జవాన్లు ప్రయాణించే బస్సు లోయలో పడడంతో 16 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 23న ఉదయం 8గంటలకు ఇండియా చైనా బార్డర్ జెమా3 ఏరియాలో బస్సు మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా లోయలోకి పడింది.
వందల అడుగుపైనుంచి ఆర్మీ బస్సు బోల్తాకొట్టి లోయలో పడ్డంతో 20 మంది జవాన్లలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని గాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దుర్ఘటన జరిగిన లొకేషన్ లాచెన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ డెడ్బాడీలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంగ్టక్లోని ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి తరలించారు.