Drinking Warm water : ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మానికే కాదు, శరీరంలోని కొన్ని అవయవాలకు కూడా లాభాలు ఉన్నాయి. చర్మ సౌందర్యం కోసం చాలా మంది చికిత్స చేయించుకుంటారు. డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారాలు, ద్రవ పదార్థాల మీదే మన చర్మ సంరక్షణ ఆధార పడి ఉంటుంది. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఇవన్నీ అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువశాతం నీరు ఉంటుంది. అవయవాలు, కణాలు పనిచేసేందుకు, జీవక్రియలకు నీరు చాలా అవసరం. అందుకే రోజూ కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అంతేకాకుండా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో మన శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట వస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో మొటిమలు పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా గోరువెచ్చని నీరు తాగితే మన జీర్ణక్రియ బాగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది, చర్మం తేమగా ఉంటుంది. గోరువెచ్చని నీరు వల్ల రక్త సరఫరా కూడా బాగుంటుంది. చర్మానికి పోషకాలు అందుతాయి. చర్మం తాజాగా ఉండటంతో పాటు ఫ్రీ ర్యాడికల్స్తో దెబ్బతిన్న చర్మ కణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిపోయి వృద్ధ్యాప్య ఛాయలు కనిపించవు. గోరువెచ్చని నీటి వల్ల మల బద్ధకం పోతుంది, ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికిపోతాయి. మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.