Devara Dialogue : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర.. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లో 300 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఆరెళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఎన్టీఆర్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ప్రతి సినిమా హిట్ అవ్వడానికి కొన్ని డైలాగులు ఉంటాయి. అలాగే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఇందులోని కొన్ని డైలాగులు జనాలను ఆలోచనలో పడవేస్తున్నాయి. ఆ డైలాగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవరాలోని ఈ డైలాగ్ ను విన్నారా?
దేవర మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. సినిమాకు మంచి టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ కూడా అందుకుంటుంది. ఈ సీనిమా మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి డైలాగ్ పవర్ ఫుల్లే.. సినిమా మొత్తాన్ని ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చేశాడు కొరటాల శివ ఏదో మ్యాజిక్ చేశాడు. జనాలు సినిమాను చూస్తున్నంత సేపు కళ్ళు ఆర్ఫకుండా చూస్తున్నారు.. మరి ఈ మూవీలో నిన్న రేత్రి మళ్ళీ సంద్రం ఎర్ర సముద్రంగా మారినట్టు కళ వచ్చింది సుగాల! ఇక్కడ మళ్ళీ అంటే?.. అంతకు ముందు ఏదో జరిగింది దేవరకు అని ఈ డైలాగ్ ను ఫ్యాన్స్ హైలెట్ చేస్తున్నారు. ఈ డైలాగ్ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 లో చూడాలని తెలుస్తుంది.. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకుంది. మరి రెండో పార్ట్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది..
దేవర మూడు రోజుల కలెక్షన్స్..
ఇక దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది. దేవర సినిమాకు ఇండియా మొత్తం కలిపి రూ. 30 కోట్లు రాబట్టిందని టాక్. మొత్తంగా వరల్డ్ వైడ్ మొదటి రోజు రూ. 172 కోట్లు, రెండో రోజు రూ. 243 కోట్లు వసూల్ చేసింది.. ఇక మూడో రోజుకు 30 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం రెండో రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. రూ. 243 కోట్లు వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇక మూడో రోజుకు గాను మరో 45 కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసిందని టాక్.. మూడో రోజు కలెక్షన్స్ ఎంత అనేది దేవర టీమ్ ప్రకటించాల్సి ఉంది.. ఈ కలెక్షన్స్ ఈ వీకెండ్ కు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.