Telangana Politics : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన రామచంద్ర భారతిని.. మరో కేసులో బంజాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్ కేసులో రామచంద్ర భారతిని అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. సిట్ దర్యాప్తులో రామచంద్ర భారతి ల్యాప్ టాప్ సీజ్ చేశారు.
అందులోనే రెండు పాస్పోర్టులను అధికారులు గుర్తించడంతో బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రామచంద్రభారతి ఇటీవల విడుదలయ్యారు. ఇప్పుడు నకిలీ పాస్ పోర్టు కేసులో అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.