Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. లాభాలతో సెషన్ ప్రారంభించినప్పటికీ.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
ఐరోపా, అమెరికాలో ఆర్ధిక మాంద్యం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో దేశీయ మార్కెట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు సెన్సెక్స్ 241.02 పాయింట్లు నష్టపోయి 60వేల 826.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 71. 75 పాయింట్ల నష్టపోయి 18వేల 127.35 దగ్గర స్థిరపడింది.