Sabitha Indra Reddy : ప్రధాని మోడీ డైరెక్షన్లో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ డెవలెప్ చేశారని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.
8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దిగిపోయినపుడు హైదారబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసని మంత్రి సబిత అన్నారు.