IIFA2024: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 2024 వేడుకలు దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో టాలీవుడ్ తారలు కూడా సందడి చేశారు. ఇక ఈసారి టాలీవుడ్ స్టార్ హీరోస్ దే హవా అని చెప్పాలి. మరి ఈ వేడుకలో మన స్టార్స్ ఎలా సందడి చేశారో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవికి ఐఫా 2024 లో అరుదైన అవార్డు అందింది. ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు ఇచ్చి మెగాస్టార్ ను గౌరవించింది ఐఫా.
ఐఫా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలు, హీరోయిన్లు సందడి చేశారు.
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాతి ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవరించాడు. ఈవెంట్ మొత్తంలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
విలక్షణ నటుడు నాజర్, సీనియర్ బ్యూటీ మాలాశ్రీ.. ఈవెంట్ లో సందడి చేశారు. తమకు ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
అందాల బ్యూటీ రాశీ ఖన్నా.. తన అందంతో చూపరులను మెప్పించింది. ఈ మధ్య బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న రాశీ ఐఫాకు రావడం సంతోషంగా ఉందని తెలిపింది.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రెజీనా కాసాండ్రా తమ అందంతో ఈవెంట్ ను హీటెక్కించారు. బ్లాక్ డ్రెస్ లో కృతి, వైట్ డ్రెస్ లో రెజీనా ఎంతో అందంగా కనిపించారు.
మెగాస్టార్ చిరంజీవి మరియు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న నటుడు జయరామ్.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాండ్ తో దుబాయ్ మొత్తాన్ని మోత మోగించాడు. తెలుగు సాంగ్స్ తో ఈవెంట్ మొత్తం పిచ్చెక్కించాడు.
ఇక ఒలిక్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఇదే అని చెప్పాలి. టాలీవుడ్ మూడు ఫిల్లర్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించి మెప్పించారు.
రెడ్ కలర్ డ్రెస్ లో ప్రగ్య జైస్వాల్ ఈవెంట్ కే కళ తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.