IMA : ప్రపంచాన్ని ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్పై ప్రభావం ఎలా ఉండనుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు చెందిన ప్రముఖ వైద్యులు డా. అనిల్ గోయల్ స్పష్టం చేశారు. భారత్లో ఇప్పటికే 95 శాతం మంది కరోనా వ్యాక్సిన్ డోసులను తీసుకోవడంతో సెకండ్ వేవ్ అంత దారుణ పరిస్థితి రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే అవకాశం కూడా లేకపోవచ్చని అన్నారు.
చైనీయులకన్నా భరతీయులకు రోగనిరోధక శక్తి అధికం ఉన్నందున పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. అయితే ప్రజలు మాత్రం నిత్యం.. మాస్క్, సానిటైజర్, కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ను మళ్ల అనుసరించాలన్నారు. ప్రస్తుతం భారత్లో 4వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మృతదేహాల కోసం మార్చురీలు కూడా సరిపోక బయట పెట్టిన డెడ్బాడీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.