Narendra Modi : చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంపై చర్చించారు. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
పండగల సీజన్ మొదలైంది కనుక కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని తప్పని సరి చేయాలని వైధ్య అధికారులకు ప్రధాని మోదీ చెప్పారు.
కరోనా ఇక ఉండదని అనుకుంటున్న తరుణంలోనే మహమ్మారి మరో సారి తన ఉగ్రరూపం చూపించడానికి సన్నద్ధమైంది. చైనా, అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా ఉన్నాయి.
ఒమిక్రాన్ బీఎఫ్ 17 కొత్త వేరియంట్ పుట్టుకురావడంతో ఈ కేసులను గుర్తించి చికిత్స చేయడానికి వైద్యులకు, పరిశోధకులకు తలనొప్పిగా మారింది. భారత్లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ.. సెకండ్ వేవ్ లాగా ఒకే సారి కరోనా కేసులు భారత్ను చుట్టుముడితే పరిస్థితి ఏంటని పలువురిలో ఆందోళన మొదలైంది.