Perni Nani Key Comments on Chandrababu Naidu: తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నానీ జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సి అవసరం ఏంటి అని ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతో జగన్ అనేక సార్లు దర్శనం చేసుకున్నారు కదా.. తిరుమలకు వచ్చే వారందరిని నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు పేర్ని నాని. మోదీతో అన్యమతస్తుడు తిరుమల వెళ్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై నిరసనలు వ్యక్తం చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పేర్ని నాని ఆలయాల్లో నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
అదేవిధంగా చంద్రబాబును విమర్శిస్తూ.. నిజంగా మీరు చెప్పే మాటలన్ని నిజమైతే హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసం మీరు బతుకుతున్నారనిపిస్తే.. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజు మీరు చర్చీలకు వెళ్లి బైబుల్లో వాఖ్యాన్ని ఎందుకు చదువుతున్నారు.. నేను దేవుడ్ని నమ్ముతున్నాని ఎందుకు చెబుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నావా, ఏసుప్రభువుని నమ్ముతున్నావా అంటూ విమర్శలుగుప్పించారు. మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ మోహన్ తాత తండ్రి ఏసు ప్రభువును కొలవడం మెదలుపెట్టారని, ప్రజలకు తెలుసని చెప్పారు.
Also Read: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’
జగన్ మతమేంటో తెలుగు ప్రజలకు తెలుసు. దేవునికి పూజ చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజ చేసే చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడమేంటన్నారు. ఇటీవల క్రిస్టియన్ నటి శ్రీవారిని దర్శించుకున్నారని, ఆమెకు డిక్లరేషన్ ఇచ్చారా అంటూ పేర్ని నాని నిలదీశారు.