Beijing : చైనాలో ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు చైనాలోని ప్రముఖ సింగర్ జేన్ ఝాంగ్ చర్యలు ఇప్పుటు హాట్ టాపిక్గా మారాయి. ‘న్యూ ఇయర్ వేడుల్లో ఇబ్బంది అవుతుందని..ఇప్పుడు కరోనా వైరస్ కావాలని అంటించుకున్నా’ అని ఆ ప్రముఖ సింగర్ ప్రకటించింది. ఈ వయవహారంపై నెటిజన్లు ఆ సింగర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం చైనాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రామన్ బిఎఫ్ 17’ అక్కడ అందరి ప్రాణాలతో చలగాటం అడుతోంది. అనేకమంది మృత్యువాత పడుతున్నాయి. మార్చురీలు చాలక ఆసుపత్రి యాజమాన్యం, సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో వైపు..రానున్న మూడు నెలల్లో చైనాలో లక్షల్లో చనిపోతారనే వార్త కూడా వినిపించిన విషయం తెలిసిందే.
ఇలాంటి భయానక పరిస్థితిలో సింగర్ జేన్ ఝాంగ్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగర్ జేన్ మాట్లాడుతూ.. కరోనా పేశంట్ల దగ్గరికి నేరుగా వెళ్లి కొంత సేపు గడిపానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. న్యూ ఇయర్ సమయానికి కరోనా తగ్గి కోలుకుంటానని..ఇక కోవిడ్ మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జేన్ ఝాంగ్ పై అనేక విమర్శలు రావడంతో ఆమె ఆ పోస్టును డిలీట్ చేసింది.