Kerala landslide: కేరళలో రెండు నెలల క్రితం భారీ వరదలు, కొండచరియలు విరిగపడడంతో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అయితే వారిలో చాలా మంది మృతదేహాలు కూడా లభించలేదు. ఈ క్రమంలో కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన అర్జున్ అనే లారీ డ్రైవర్ కూడా షిరూర్ వరదల్లో కొట్టుకుపోయాడు.
లారీ ట్రాన్స్పోర్టులో పనిచేసే అర్జున జూలై 16, 2024న లారీలో టింబర్ లోడ్ తీసుకొని కర్ణాటక బెలగావికి బయలుదేరాడు. కానీ మధ్యలో నేషనల్ హైవే 66 మార్గం షిరూర్ వరదల్లో అతని లారీ వరదల ప్రభావంలో కొట్టుకుపోయింది. ఆ లారీలో మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read: ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!
లారీ కోసం లారీ యజమాని కేరళ, కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కర్ణాటక పోలీసులు జూలై 28న విచారణ చేసి..గంగావళి నదిలో వచ్చిన భారీ వరదల్లో లారీ కొట్టుకుపోయి ఉంటుందని తేల్చారు. అయితే వరదల్లో చాలామంది గల్లంతు కావడంతో కర్ణాటక ప్రభుత్వం గోవా రాష్ట్రం నుంచి నదిలో డ్రెడ్జెంగ్ మెషీన్లతో తవ్వకాలు చేసింది. ఈ తవ్వకాల్లో కొన్ని మృతదేహాలు లభించాయి. వాటిలో అర్జున్ శవం ముక్కలు లభించాయి.
అర్జున్ కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లారీలో లభించిన మూడు మృతదేహాల్లో అర్జున్ శవం గుర్తుపట్టడానికి అర్జున్ సోదరుడు అభిజిత్ డిఎన్ఏతో శవాలకు పరీక్షలు చేశార. అందులో కొనని శరీర భాగాలు అభిజిత్ డిఎన్ఏతో పోలి ఉండడంతో అర్జున్ శవాన్ని గుర్తుపట్టారు. అర్జున్ స్వగ్రామమైన కోజికోడ్ లోని కన్నాడిక్కల్కు శవాన్ని తరలించారు. శవం తరలింపు ఖర్చులన్నీ కేరళ ప్రభుత్వం భరింస్తోందని స్థానిక మీడియా తెలిపింది.
Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..