Road Accident in Hyderabad: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విద్యార్థులను ఎక్కించుకొని మెదక్ జిల్లాకు బయలుదేరిన బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో బీవీ రాజు కాలేజీకి చెందిన రెండు బస్సులు పరస్పరం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. విద్యార్థులను తీసుకొని కాలేజీకి వెళ్తుండగా.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ముందుగా వస్తున్న అదే కాలేజీకి చెందిన బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు సుమారు అరగంటపాటు శ్రమించి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. అలాగే, గాయపడిన విద్యార్థులతో పాటు ఇద్దరు డ్రైవర్లను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ నాగరాజుగా గుర్తించారు. ప్రస్తుతం మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: ఆ హోటల్లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?
వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన తర్వాత నర్సాపూర్ – సంగారెడ్డి రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జాం అయింది. మృతదేహం బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో చాలా సమయం పట్టింది. దీంతో నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు కళాశాల సిబ్బంది ప్రయత్నించారు.
పరస్పరం ఢీకొన్న కాలేజీ బస్సులు
ఒకదాన్నొకటి ఢీకొన్న బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు బస్సులు
ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలు, కాలేజీలోని ఆస్పత్రికి తరలింపు
అరగంట పాటు శ్రమించి బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ని బయటికి తీసిన స్థానికులు… pic.twitter.com/7Kuvxjk8C3
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024