Pushpa 2: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. అన్ని బావుండి ఉంటే ఈపాటికి పుష్ప 2 వచ్చి రెండు నెలలు అయ్యేది. కానీ, మంచి సినిమాను ప్రేక్షకులకు చూపించడం కోసం సుకుమార్.. పుష్ప 2 ను ఒక శిలను చెక్కినట్లు చెక్కుతున్నాడు.
ఇక మధ్యలో డైరెక్టర్ – హీరో ల మధ్య విభేదాల వలన పుష్ప 2 ఇంకొంచెం ఆలస్యం అయ్యింది. ఇలా ఆలస్యం అవుతూ వచ్చి .. చివరకు డిసెంబర్ 2 న పుష్ప 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో దర్శకధీరుడు రాజమౌళి దర్శనమిచ్చాడు.
సాధారణంగా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు షూటింగ్ జరిగినప్పుడు స్టార్స్.. అలా సెట్స్ కు వెళ్లి వస్తూ ఉంటారు. అది కాకుండా ఒకే చోట రెండు, మూడు సినిమాలు షూటింగ్ జరిగినప్పుడు పలకరించి వస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఏ కారణమో తెలియదు కానీ.. పుష్ప 2 సెట్ లో జక్కన్న సందడి చేశాడు. ఈ విషయాన్నీ సుకుమార్ .. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
” డైరెక్టర్స్ అందరికి బాహుబలి మా పుష్ప 2 సెట్ కు వచ్చారు. పుష్ప 2 సెట్లో రాజమౌళి గారిని కలవడం మరచిపోలేని అనుభూతి. అతని రాక.. మా సెట్ను మరింత చైతన్యవంతం చేసింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నిజం చెప్పాలంటే .. రాజమౌళికి ఇష్టమైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ విషయాన్నీ జక్కన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం సినిమా అంటే రాజమౌళికి మరింత ఇష్టం. ఎప్పటినుంచో ఫ్రెండ్స్ గా ఉన్న ఈ లెజెండ్స్ చాలా గ్యాప్ తరువాత ఇదుగో ఇలా కలిసి కనిపించడం ఫ్యాన్స్ కు ఆనందంగా ఉంది. మరి పుష్ప 2 తో సుకుమార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.