Redmi Note 14 Pro Plus| చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ త్వరలో ఒక కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఒక కొత్త ఫ్లాగ్ షిప్ సిరీస్ రెడ్మి నోట్ 14 5జి త్వరలో భారతదేశంలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ చైనాలో సెప్టెంబర్ 26, గురువారం లాంచ్ కానుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ లో రెడ్మి నోట్ 14 (Redmi Note 14), రెడ్మి నోట్ 14 ప్రో (Redmi Note 14 pro), రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ (Redmi Note 14 pro plus) లాంటి స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఉంటాయి.
అయితే షోవోమి కంపెనీ రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ కు ఇండియాలో లాంచ్ చేసేందుకు బిఐఎస్ ( Bureau of Indian Standards) సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే బిఐఎస్ వెబ్ సైట్ పై ఈ ఫోన్ దర్శనిమిస్తోంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం.. రెడ్మి నోట్ 14 5జీ స్మార్ట్ ఫోన్ 3c సర్టిఫికేషన్ సైట్ లో కూడా కనిపిస్తోంది. ఈ వెబ్సైట్లో ఈ స్మార్ట్ ఫోన్ 24090RA29C మోడల్ నెంబర్ తో చూడవచ్చు. ఇంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్ ఐఎంఈఐ డేటాబేస్ లో కూడా యూజర్లు స్పాట్ చేశారు. బిఐఎస్ వెబ్సైట్ లో రెడ్మి నోట్ 14 ప్రో మోడల్ నెంబర్ 24094RAD4I తో చూడవచ్చు.
Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్
ఇలా సర్టిఫికేషన్ వెబ్సైట్స్ లో ఉండడంతో కంపెనీ త్వరలోనే భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేయనుందని అంచనా. అయితే ముందు షావోమీ తన కొత్త మోడల్స్ ను ఇతర దేశాల్లో లాంచ్ చేసిన తరువాత ఇండియాలో తీసుకువచ్చేది. కానీ మోడల్ చివరి నెంబర్ లో ఐ ఉండడంతో ఇప్పుడు ఇండియాలో ముందుగానే రాబోతోందని తెలుస్తోంది.
రెడ్మి నోట్ 14 ప్రో ఫీచర్స్
రెడ్మి నోట్ 14 ప్రో లో చాలా అడ్వాన్సడ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 ఇంచ్ 1.5k OLED డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో పాటు 12GB RAM ఉంటుంది. 90W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో 6,200 mAh బ్యాటరీ కూడా ఉండడం ప్రత్యేకం.
కెమెరా విషయానికి వస్తే.. OIS సపోర్ట్ తో 800 లెన్స్ కలిగిన 50ఎంపీ ఓమ్నీవిజన్ లైట్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో 60mm and 2.5x ఆప్టికల్ జూమ్ తో ఫోకల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. కంపెనీ ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
రెడ్మి నోట్ 14 సిరీస్ ఇండియాలో లాంచ్ డేట్ గురించి చెప్పలేదు. కానీ 2025 సంవత్సరం ప్రథమార్థం కల్లా ఈ ఫోన్ ఇండియా యూజర్లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 2024 సంవత్సరం జనవరిలో ఇలాగే రెడ్మి నోట్ 13 సిరీస్ ని షావోమీ ఇండియాలో లాంచ్ చేయడం గమనార్హం.