Fighting Between Customers: కొందరు వ్యక్తులు ఓ జ్యూస్ షాప్కి వెళ్లారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలీదు. మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసింది. దీంతో జ్యూస్ షాపులో ఉన్న కత్తులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అసలు డీటేల్స్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని పిల్లర్ నెంబర్ 209 వద్ద రాయల్ జ్యూస్ సెంటర్కు కొందరు కస్టమర్లు వచ్చారు. అప్పుటివరకు ఎవరికివారు మాట్లాడుకున్నారు. అంతలో ఏం జరిగిందో తెలీదు. ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.. పంచ్లు విరిసుకున్నారు.
ఇరువర్గాల్లో ఆగ్రహం తారాస్థాయికి చేరింది. షాపు యజమానిపై సుమారు 10 నుండి 15 మంది కత్తులతో దాడి చేశారు. జ్యూస్ షాపులో కత్తులు తీసుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది.
కత్తి, ఇసుప రాడ్లు, స్క్రూ డ్రైవర్ లతో జరిగిన దాడిలో సుమారు 8 మంది వరకు గాయపడ్డారని జ్యూస్ సెంటర్ సిబ్బంది చెబుతున్నమాట. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: బెంగుళూరు ఫ్రిడ్జ్ మర్డర్ కేసులో నిందితుడు మృతి.. ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న హంతకుడు
బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు కారణంగా గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
కస్టమర్ల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి..
రాజేంద్రనగర్ లోని రాయల్ జ్యూస్ సెంటర్ లో కస్టమర్ల మధ్య గొడవ
గొడవను ఆపబోయిన జ్యూస్ సెంటర్ యజమానిపై కత్తులతో దాడి
7 మందికి గాయాలు.. పోలీసుల అదుపులో నిందితులు@psrjnr_cyb#Rajendranagar #Clash #BigTV pic.twitter.com/Pgb5FTKShh
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2024