YCP : వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని తెలిపారు. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని 1466 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.
బైజూస్ కంటెంట్ కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి నేతలు చక్రం తిప్పారన్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన జగన్.. నేడు దేనినీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.