Employee Fell off in Office: యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో.. 26 ఏళ్ల సీఏ అన్నా సెబాస్టియన్ పని ఒత్తిడి కారణంగా మరణించిన ఘటన మరువకుండానే.. యూపీలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉండగానే ఓ బ్యాంక్ ఉద్యోగిని అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన లక్నోలోని ఓ బ్యాంక్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని గోమతి నగర్లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో సదాఫ్ ఫాతిమా అడిషినల్ డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. ప్రతిరోజూ లాగే మంగళవారం (సెప్టెంబర్ 24) కూడా విధులకు హాజరైంది. తన పని చేస్తుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలిపోయారామె. వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఫాతిమా చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. పనిఒత్తిడి కారణంగానే ఆమె మరణించిందని కొందరు వాపోతున్నారు.
Also Read: మహాలక్ష్మి హత్య కేసు నిందితుడిపై వైద్యుల నివేదిక.. అతన్ని కట్టడి చేయకపోతే అంతే సంగతులు ?
యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ ఘటనపై X వేదికగా స్పందించారు. పని ఒత్తిడి కారణంగా మరో ఉద్యోగిని ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేసిందన్నారు. దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులపై ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాయో చెప్పేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు.