Tobacco in Laddu : ఖమ్మంకు చెందిన ఒక భక్తురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే తిరుమలకు వెళ్లి వచ్చారు. ఇంట్లోవారికి, ఇరుగు పొరుగు వారికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇస్తుండగా.. ఒక లడ్డూలో నమిలిన పొగాకుని పేపర్ లో చుట్టి.. దానిని లడ్డూలో పెట్టినట్లు గుర్తించారు. ఈ విషయం మీడియాకు చేరడంతో.. తెలుగు రాష్ట్రాల్లో వైరలైంది. లడ్డూ తయారీకి జంతుకొవ్వుల్ని కలిపిన నెయ్యిని వాడటమే కాకుండా.. ఇలాంటివి కూడా చేస్తున్నారా అంటూ.. శ్రీవారి భక్తులు ఫైరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. వార్తల్లో చూపించినట్లు పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందన్నది వాస్తవం కాదని, దానిని కొందరు భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారని X వేదికగా పేర్కొంది. తిరుమలలో నిర్వహించే లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పాల్గంటారని తెలిపింది. ప్రతినిత్యం లక్షలాది లడ్డూరు తయారు చేసే ప్రాంగంణంలో 360 డిగ్రీల సీసీటీవీ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. ఇంత పగడ్బందీగా లడ్డూలను తయారు చేస్తుంటే.. ప్రసాదంలో పొగాకు వచ్చిందని దుష్ర్పచారం చేస్తుండటం శోచనీయమని విచారం వ్యక్తం చేసింది టీటీడీ. ఇలాంటి తప్పు విషయాలను భక్తులు నమ్మొద్దని సూచించింది.
Also Read: మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..
It is not true that there was tobacco found in the laddu prasadam – TTD.
It is inappropriate for some devotees to spread on social media that there was a packet of tobacco found in the sacred Srivari laddu prasadam.లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లo ఉన్నది వాస్తవం కాదు – టీటీడీ pic.twitter.com/wjJoRaUqAE
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 24, 2024