Former TTD Chairman Bhoomana Karunakar Reddy Visits Tirumala: ప్రస్తుతం ఏపీలో తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తమకు వెంటనే నివేదికను సమర్పించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ విచారణ చేయనున్నది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మధ్య ఈ విషయమై రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతుంది. లడ్డూ కల్తీ కావడానికి కారకులు మీరేనంటూ ప్రస్తుత ప్రభుత్వం.. లేదు లేదు మా పాలనలో అలాంటిదేమీ జరగలేదంటూ వైసీపీ నేతలు.. ఇలా వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Also Read: జగన్… సిట్తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు
ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుమలను సందర్శించారు. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో మునిగి ఆయన ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడొద్దని అందులో పేర్కొన్నారు.
Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ