Balineni Srinivas reddy Comments: ఏపీ మాజీ సీఎం, వైసీపీ జగన్ మోహన్ రెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 26న తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు తనపై ఆది నుంచి కూడా మంచి అభిప్రాయమే ఉందని, అందుకే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు బాలినేని ప్రకటించారు.
Also Read: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి
వైసీపీలో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తను అసంతృప్తిగా ఉన్నానని తెలిసినా కూడా జగన్ పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. పార్టీలో చేరినంక జనసేన బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తనపై చేస్తున్న వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ఆ ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలీపై ఇటు పవన్ కల్యాణ్ కు తాను ఫిర్యాదు చేస్తానన్నారు.