Jaggareddy Reaction Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్… అలాంటి వ్యక్తి ఇంతమంది భక్తులను ఆందోళనకు గురిచేసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావట్లేదు. లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు… ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు. దేశవిదేశాల్లో ఉన్న భక్తులు ఇపుడు లడ్డూ తినాలా వద్దా అనే ఆందోళనలో ఉన్నారు. తిరుపతిలో స్వామి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తింటేనే భక్తులకు తృప్తి.. ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.
తిరుపతి వెంకన్న స్వామి అందరివాడు… వైసీపీ, టీడీపీ రాజకీయ గొడవల్లో శ్రీవారిని ఆలయాన్ని ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేయకండి. మీ రాజకీయాలు, కొట్లాటలు వేరే సబ్జెక్టుల మీద.. వేరే అంశాల మీద పెట్టుకోండి… అంతేకానీ దేవుడి విషియంలో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తక్షణమే విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. హిందువుల మనోభావాలను కాపాడాలని సూచించారు. తక్షణం దీనిపై విచారణ చేసి దోషులని శిక్షంచాలి. ఈ విషయంలో రాజకీయాలు మానేయండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ విశిష్టతను కాపాడటంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏపీలోని రాజకీయ పార్టీలకు ఇది నా విజ్ఞప్తి’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Also Read: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?