CLP Meeting in Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) సమావేశం ప్రారంభమయ్యింది. ఆదివారం మాదాపూర్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్ కుమార్ గౌడ్ ను సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కుల గణనపై చర్చిస్తున్నారు. అయితే, నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించినప్పుడు సీఎల్పీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీకి ఇటీవల చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Also Read: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు