Lakshmi Kataksham:శ్రీ మహాలక్ష్మి త్వరగా కలగడానికి హిందూ ధర్మశాస్త్రంలో ఎన్నో పూజలు, పునస్కారాలు ఉన్నాయి. అందులో ఒకటి రాగి చెంబు.. రాగి చెంబులో తీసుకుని నీళ్లు పోసి ఐదు తులసి ఆకులు వేయాలి. బుధవారం, లేదా ఆదివారం రోజు ఉదయం పూట ఇలా చేసి రోజంతా అలాగే ఉంచాలి. మరునాటి ఉదయం రాగి చెంబులో నీళ్లు ఇంటి ముఖం ద్వారంపై చల్లాలి. గోడలు సహా ఇల్లంతా చల్లండి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరో పని చేసినా లక్ష్మి దేవి కరుణిస్తుంది. ఇంట్లోని రాగి చెంబును శుభ్రంగా తోమి పసుపు రాసి గంధంతో చెంబుపైన స్వస్తిక్ సింబల్ రాయాలి. అది సవ్యదిశలో ఉండే సింబల్ మాత్రమే వేయాలి. రాగి చెంబులో నీళ్లు పోసి, పసుపు, కుంకుమ వేసి అందులో రూపాయి బిళ్ల పెట్టండి. సుగంధ ద్రవ్యాలు ఉంటే అత్తరు లాంటి వి కూడా వేసి ఇంట్లో ఎవరూ తొక్కని ప్రాంతంలో ముగ్గు వేసి ఉంచాలి. వీలైతే సింహం ద్వారా తెరవగానే ఎదురుగా కనిపించే ప్రాంతంలో కుడి వైపు పక్కన పెట్టాలి. అలాంటి ప్రదేశంలో పెట్టలేని వాళ్లు ఈశాన్య దిక్కులో రాగి చెంబు ఉంచండి.
బియ్యంతో ముగ్గు వేసి దానిపై రాగి చెంబును ఉంచాలి. ఇదంతా సోమవారం సాయంత్రం పూట చేయాలి. మంగళవారం, బుధవారం అక్కడ నుంచి మళ్లీ గురువారం తీసి ఆనీళ్లు చెట్టు మొదట్లో పోసి మళ్లీ ఇదే ప్రక్రియలో నీళ్లు పోసి పెట్టాలి. దాన్ని తర్వాత సోమవారం తీసేయాలి. అంటే సోమవారం , గురువారం తీస్తో పోస్తూ చేయాలి. ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రాగి చెంబు ద్వారా ఈ పరిహారం చేస్తే మీకు ఆర్థిక బాధలు తొలగుతాయి.
ఈశాన్యం గుమ్మం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. అష్టలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ప్రతి పండుగకు తప్పక గుమ్మాలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పక కట్టుకోవాలి.