India Win By 280 Runs, R Ashwin Takes Six-Wicket Haul: టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ జట్టుపై ఏకంగా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో 45 రోజుల తర్వాత.. గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన టీమిండియాకు శుభారంభం దక్కింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్.. విభాగాల్లో దుమ్ములేపిన టీమిండియా… మొదటి టెస్టులో 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి.. విజయం సాధించింది.
మ్యాచ్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. రవిచంద్రన్ అశ్విన్ 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 234 పరుగులకే కుప్పకూలారు. బంగ్లాదేశ్ బాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అశ్వినన్ తో పాటు జడేజా మూడు వికెట్లు తీశాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లోనే 376 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు.
Also Read: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆదిక్యం దక్కింది. బ్యాటింగ్ లో అశ్విన్, రవీంద్ర జడేజా తన సత్తాను చాటితే…. బౌలింగ్ లో బుమ్రా నిప్పులు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
Also Read: IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్
గిల్, రిషబ్ పంత్ శతకాలతో అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో శతకం చేయడంతోపాటు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది టీమిండియా జట్టు.