Suchithra: ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న వివాదాలు అస్సలు వివాదాలే కాదు. చివరికి హేమా కమిటీ కూడా చాలా తక్కువ మంది సెలబ్రిటీలనే బయటపెట్టింది. కానీ, సుచీ లీక్స్ చేసిన రచ్చ వేరే లెవెల్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, సింగర్స్, డైరెక్టర్స్.. ఇలా తమిళ్ ఇండస్ట్రీ మొత్తాన్ని రోడ్డు మీదకు ఈడ్చింది. సింగర్, డబ్బింగ్ఆర్టిస్ట్ సుచిత్ర గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇక ఆమె సాంగ్స్ గుర్తున్నా లేకున్నా.. ఆమె లీక్ చేసిన స్టార్స్ ఫొటోస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు.
ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియా.. ఇలా మొత్తం ఇండస్ట్రీ రాసలీలలను ఫోటోలతో సహా లీక్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఆ తరువాత సుచిత్రకు పిచ్చి పట్టిందని, ఆమె మెంటల్ హెల్త్ బాలేదని ఆమె భర్త.. హాస్పిటల్ లో చేర్పించాడు. ఇక కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే సుచిత్ర బయటకు రావడం మొదలుపెట్టింది. బయటకు వచ్చాక కూడా ఆమె వారిని వదలలేదు. తన కెరీర్ లో లైంగిక వేధింపులను ఎదుర్కున్న వారి గురించి, పాల్పడ్డ వారి గురించి బయటపెడుతూ ఇంకా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర.. లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ ఒక కామ పిశాచి అని చెప్పి షాక్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె. బాలచందర్ కు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కమల్ హాసన్, రజినీకాంత్, మమ్ముట్టి, చిరంజీవి లాంటి స్టార్స్ ను తమిళ్ కు పరిచయం చేసింది ఆయనే. 2014 లో కె. బాలచందర్ మరణించారు. ఇక అలాంటి డైరెక్టర్ ఒక ఉమైనజర్ అని చెప్పుకొచ్చింది.
” చనిపోయేంత వరకు బాలచందర్ ఒక లస్టీ మెన్ గా ఉన్నారు. మహిళలందరిని ఆయన కామంతోనే చూసేవాడు. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం చాలామందికి తెలుసు. చాలామంది నన్ను కూడా ఫామ్ హౌస్ కి పిలిచారు. కానీ, నేను వెళ్ళలేదు” అని తెలిపింది. ఇక దీంతో తమిళ్ అభిమానులు సుచిత్ర పై ఫైర్ అవుతున్నారు. మనుషుల మధ్య లేని ఒక మనిషి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం పద్దతి కాదని, ఇంకా ఈమెకు పిచ్చి తగ్గలేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు సుచిత్ర ఇంకెన్ని విషయాలను బయటపెడుతుందో చూడాలి.