Yennam Srinivas Reddy Serious on BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. ‘పీఏసీ కమిటీలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చెందని వ్యక్తులు లేరు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మేడిగడ్డ బ్యారేజీలో కమీషన్లు తిన్నారు. మళ్లీ ఈరోజు పీఏసీ చైర్మన్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత బీఆర్ఎస్ లో జరిగిన అక్రమాలను, కుంభకోణాల వివరాలను ప్రజల ముందు పెడుతాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి
కాగా, అసెంబ్లీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసలు చైర్మన్ ఎన్నికే చెల్లదంటూ వారు వాదించారు. ఆ తరువాత మిగతా ఎమ్మెల్యేలు పీఏసీ సమావేశాన్ని కొనసాగించారు. పలు అంశాలపై పీఏసీ విస్తృతంగా చర్చించింది.
ఇదిలా ఉంటే.. వాకౌట్ చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విభిన్న వాదనను వినిపించారు. పీఏసీ చైర్మన్ ఎన్నిక చెల్లదన్నారు. పద్ధతి ప్రకారం ఆ ఎన్నిక జరగలేదన్నారు. ఆ ఎన్నికను ఖండిస్తూ తాము వాకౌట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?