KTR Serious Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణలో భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో రేవంత్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు.
Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?
అమృత్ పథకానికి సంబంధించి జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ఆ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు. ఇప్పటివరకుక జరిగిన అమృత్ పథకం టెంజర్లను రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,1137 కోట్ల పనులను అప్పగించారని, రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విచారణ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపడుతాయన్నారు.
Also Read: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?