Kokapet: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు అధికారులు. సర్వే నెంబర్ 147లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కొంతమంది. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారంపై గండిపేట తహసీల్దార్ విచారణ జరిపారు.
నిర్మాణాలు కడుతున్నవి అక్రమమేనని తేలింది. దీంతో శనివారం ఉదయం జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పర్వం కొనసాగుతోంది.
కూల్చివేతలను అడ్డుకునేందుకు సంబంధిత ప్రజలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాము ఎన్నో ఏళ్లగా ఇక్కడ ఉంటున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిరోజుల కిందట హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ మధ్య హైడ్రా కూల్చివేతల కార్యక్రమం మొదలుపెట్టింది. హైడ్రా రంగంలోకి దిగకముందే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు గండిపేట రెవిన్యూ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు
సర్వే నెంబర్ 141లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు#Kokapet #Demolish #BigTV pic.twitter.com/HhQtQnju0q
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2024