Intinti Ramayanam Serial Today September 21: నిన్నటి ఎపిసోడ్ లో కమల్ తో కలిసి పల్లవి నాన్న సిట్టింగ్ వేస్తాడు.. అయితే కమల్ గదిలోకి వెళ్తే పల్లవి లేదన్న విషయం తెలిసిపోతుందని అతను మాటలు చెప్పాలి అని బలవంతంగా కూర్చోబెడతాడు.. నేను తాగను కదా నన్ను ఎందుకు పెడతారు అని కమల్ అంటాడు. మందు తాగొద్దు కనీసం కూల్ డ్రింక్ తాగు అని అంటాడు. గ్లాస్ లో కూల్ డ్రింక్ తాగుతాడు. అంతలోనే ఎపిసోడ్ అయిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మామ అల్లుడులు ముచ్చట్లు పెట్టుకుంటారు. ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడతారు. ఏంటి అల్లుడు ఎనిమిది లీటర్ల పాలు తాగుతావని అన్నారు. మరి ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తాగలేకపోతున్నావే అని అతను అడుగుతాడు. కమల్ బావకు కంపెనీ ఇవ్వడానికి అని అంటాడు. ఇక అల్లుడు మీరు కానివ్వండి నేను వెళ్లి పడుకుంటాను అంటాడు. అయితే అప్పుడేనా అంటే నేను రెండే పెగ్గులు అని చెబుతాడు. అంతలోకే ఫోన్ వస్తుంది. ఫైల్ కావలి సెండ్ చేసి మళ్లీ కూర్చుందాం అని చెబుతాడు. ఇక లోపలకు వెళ్లిన అతను పల్లవి వచ్చిందేమో అని చూస్తాడు. పల్లవి టెన్షన్ తో అటు ఇటు తిరుగుతుంది. నువ్వు వచ్చేసావా.. రాలేదు అనుకున్నాను అని అంటాడు. సరే గానీ వెళ్లిన పని ఏమైంది అంటే పల్లవి ఆల్మోస్ట్ డన్ డాడీ. కానీ చివరి నిమిషంలో ప్లాన్ ఫెయిల్ అయిందని చెబుతాడు.
అవునా అంటే.. అవును డాడీ అది స్పృహలోకి వస్తే మనం ఊసలు లెక్కపెట్టాలని పల్లవి టెన్షన్ పడుతుంది. అప్పుడే ఆమె తండ్రి ని జంకా ఒక్కటే ఉంది. అటు సైడ్ లేదు అంటే అప్పుడు చూసుకొని షాక్ అవుతుంది. ఏంటి చూసుకోలేదు. హాస్పిటల్ లో పడిందా లేదా ఎక్కడైనా దారిలో పడిందా అని ఆలోచిస్తుంది పల్లవి. అప్పుడు వాళ్ల నాన్న బయట పోతే పర్వాలేదు కానీ హాస్పిటల్ లో పడితే ప్రాబ్లమ్ లేదు కానీ హాస్పిటల్ లో పడితే అడ్డంగా దొరికిపోతాము అను మాట్లాడుకుంటారు.
ఇక హాస్పిటల్ వెళ్లిన అవని అక్షయ్ లు కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏం జరిగిందని అడుగుతారు. ఏమో మేడమ్ ఆవిడా స్టాఫ్ నర్స్ అని చెప్పింది. ఇక డాక్టర్ పిలుస్తున్నారని చెప్పింది అని చెప్పింది. నేను నిజమే అని నమ్మి వెళ్లాను. అప్పుడే ఇలా జరిగిందని చెబుతాడు.. స్క్రాఫ్ కట్టుకోవడం వల్ల ఆమెను గుర్తు పట్టడం కష్టమే అవుతుంది అని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో అక్షయ్, అవనీలు ఎవరో కావాలనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు స్వాతిని చంపాలని అనుకున్నారని చెబుతాడు. అంత అవసరం ఎవరికీ ఉంది. మిమ్మల్ని ఇరికించాలని ఎవరు అనుకుంటారు అని అవని అంటుంది. అప్పుడు అవని చెయ్యి తగిలి సిరప్ బాటిల్ కింద పడుతుంది. కింద చూస్తే జూంకా దొరుకుతుంది.. ఈ జూంకా ఎవరిదీ.. హత్య చెయ్యడానికి వచ్చిన అమ్మాయిదా? అని ఇద్దరు ఆలోచిస్తారు. అప్పుడు పల్లవి పెట్టుకున్న వాటిలా ఉన్నాయని అంటుంది.
ఇక అక్షయ్ కు అదే విషయాన్ని చెబితే అవును అని ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్లి గట్టిగా పల్లవి అని అరుస్తారు. ఇంట్లో ఉన్న అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైందని అడిగితే అక్షయ్ నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెబుతాడు. ఇక పల్లవి ఏం చేసింది అని అందరు అనుకుంటారు. పల్లవి అమ్మ కూడా నా కూతురును ఎందుకు అంటారు. నా కూతురుకు ఏం సంబంధం ఉంది అని అంటారు. దానికి అక్షయ్ రెస్పాండ్ అవ్వడంతో అందరు షాక్ అవుతారు. రెండు నిమిషాలు ఆగండి చెబుతాను. మీకే అసలు హంతకులు ఎవరా అని తెలుస్తుంది. అని అక్షయ్ అంటారు. ఇక అందరు టెన్షన్ పడుతారు. అప్పుడు అవని పల్లవి జూంకా ఏది అని అడుగుతుంది. నన్ను అనుమానిస్తున్నారు. నాకేం పని ఉంది. ఎలా కనిపిస్తాను అని దబాయిస్తుంది పల్లవి.. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కోర్టులో స్వాతి లేదని అక్షయ్ కు శిక్ష పడుతుందని అనుకున్నారు. కానీ ఆమె స్పృహలోకి వచ్చేసింది అని లాయర్ చెబుతాడు. స్వాతిని చూసి షాక్ అవుతుంది.. పల్లవిని అరెస్ట్ చేస్తారా? స్వాతి ఏమి చెబుతుందో రేపటీ ఎపిసోడ్ లో చూడాలి..