Ex MP Nandigam Suresh’s house: వైసీపీ మాజీ ఎంసీ నందిగం సురేష్ ఇంట్లో శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో పెద్దలు ఎవరు లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. ఇంటికి సంబంధించినవారు ఎవరైనా వస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసులు పేర్కొన్నారు.
ఇంతకీ పోలీసులు ఎందుకు సోదాలు చేశారు? సోదాల వెనుక అసలేం జరుగుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆయనను రెండురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దాని ఆధారంగా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్
ఇంతకీ సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? సురేష్ భార్య గానీ, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంతో నోటీసు అంటించారు. దాడి జరిగిన రోజు ఫోటోలు, విజువల్స్ దగ్గర పెట్టి విచారణ చేపట్టారు పోలీసులు. ఫోటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 60 ప్రశ్నలు ఆయనను అడిగినట్టు సమాచారం.
అందులో కొన్నింటికి రిప్లై ఇచ్చారట. దాని ఆధారంగానే సోదాలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారాయన. గురువారంతో ఆయన రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఆయనకు వచ్చే నెల మూడు వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెల్సిందే.
మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటిపై రెయిడ్స్
గుంటూరు జిల్లా తుళ్లూరులోని నందిగం సురేష్ ఇంట్లో తనిఖీలు
పెద్దలు ఎవరు లేకపోవడంతో నోటీసులు అంటించి వెళ్లిన పోలీసులు
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు#NandigamSuresh #PolieRaids #BigTV pic.twitter.com/wPH03BmVJ1
— BIG TV Breaking News (@bigtvtelugu) September 20, 2024