India vs Bangladesh LIVE, 1st Test Day 2: బంగ్లాదేశ్ తో చెన్నయ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ ఎట్టకేలకు కష్టాల నుంచి గట్టెక్కి 376 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆల్ రౌండర్లు అశ్విన్, జడేజా అండతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే అశ్విన్ సెంచరీ చేసినా.. జడేజా మాత్రం మిస్ అయ్యాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటన్ 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అయితే తను అశ్విన్ తో కలిసి.. భారత ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు మాత్రం అద్భుతమని చెప్పాలి. 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 86 పరుగులు చేసిన జడేజా పేసర్ తస్కిన్ అహ్మద్ బౌలింగులో అవుట్ అయ్యాడు. అశ్విన్ తో కలిసి 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆ తర్వాత సెంచరీ హీరో అశ్విన్ కూడా ఒంటరిగా పోరాడి 113 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తను 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 113 పరుగులు చేశాడు. అనంతరం ఆకాశ్ దీప్ (17) కాసేపు మెరిపించాడు. తర్వాత బుమ్రా (7) వెంటనే అయిపోయాడు. సిరాజ్ ఎప్పటిలా నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి టీమ్ ఇండియా 91.2 ఓవర్లలో 376 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Also Read: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్
బంగ్లాదేశ్ బౌలింగులో హసన్ మహమూద్ 5, తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రాణా, మెహిదీ హాసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ లంచ్ కి ముందు 26 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షద్మాన్ (2), జకీర్ హాసన్ (3), మోమినల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి కూడా .ఇండియాలాగే ఉంది. స్టార్టింగులో తడబడుతూ ఆడుతోంది. లంచ్ తర్వాత మరేమైనా పుంజుకుంటుందేమో చూడాలి.
టీమ్ ఇండియాకి తొలి వికెట్ బ్రేక్ బుమ్రా ఇస్తే, వెంటవెంటనే 2 వికెట్లు ఆకాశ్ దీప్ తీసి.. జట్టులో ఉత్సాహాన్ని పెంచాడు.