Ritu Varma: రీతూ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
10 మార్చి 1990న ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో జన్మించింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంది.
అనంతరం 2013లో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘బాద్షా’ సినిమాలో కాజల్కు చెల్లి పాత్రలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.
అనంతరం 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్గా నంది అవార్డును, అలాగే బెస్ట్ యాక్ట్రెస్గా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకుంది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కానీ ఆ సినిమాలేవి పెద్దగా స్టార్డమ్ తెచ్చిపెట్టలేదు.
అలా టాలీవుడ్, కోలీవుడ్తో సహా ఇతర భాషల్లో సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా ఉంది.
ప్రస్తుతం శ్రీవిష్ణుతో ‘స్వాగ్’ సినిమాలో నటిస్తుంది. అలాగే ధృవ నచ్చతిరం: చాప్టర్ 1-యుద్ధ కాండమ్ అనే తమిళ సినిమాలో నటించింది.