Satyabhama Serial Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో మహాదేవయ్యను చంపడానికి వచ్చిన వాళ్లు క్రిష్ ను పొడిచారు. సత్య హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.. ఇక మహదేవయ్య, రుద్ర క్రిష్ అమ్మ, నానమ్మలు హాస్పిటల్ కు వస్తారు. ఈ గొడవల జోలికి వెళ్లొద్దు అంటే వెళ్తారు. తనని ఎవరు ఎటాక్ చేశారో అని ఆలోచిస్తున్న మహదేవయ్య చుట్ట కాల్చేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడే నర్స్ వచ్చి ఇది హాస్పిటల్ లో కాల్చడం తప్పు అంటుంది. దానికి రుద్ర మా బాపును అంటావా అని అరుస్తాడు. దానికి సత్య ఇది పబ్లిక్ ప్లేస్ స్మోకింగ్ చెయ్యడం తప్పు అంటుంది. వేరే మంది ముందు మీ మామయ్యను అవమానిస్తావా అని సత్య అత్త అరుస్తుంది..
ఇక ఈరోజు ఎపిసోడ్ లో అత్తయ్య నేను అవమానించలేదు మనం ఏమి పై నుంచి ఊడిపడలేదు. అందరికి ఒక్కటే న్యాయం ఉంటుందని చెబుతుంది. అంతలోపే డాక్టర్ అక్కడకు వస్తాడు. అతనికి ప్రాణాపాయం ఏమి లేదు.. మీరు చూడొచ్చు అంటారు. అందరు లోపలికి వెళ్లి క్రిష్ ను ఎలా ఉందని అడుగుతారు.. నాకు ఏమి కాలేదు దీనికే ఇంత చేస్తారా అని అంటే అప్పుడు భైరవి.. నా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉంటే బాధ లేదని నీ పెళ్ళాం అంటుందని చెబుతుంది. ఇక బామ్మ దూరంగా ఉండటం చూసిన క్రిష్.. ఏందీ బామ్మ మంచి ముహూర్తం అన్నావ్ ఇలా జరిగింది. నేను ఏది చెప్పినా పిచ్చిదే అంటారు అని అంటుంది. దానికి క్రిష్ నువ్వు పిచ్చిదానివే.. అని అంటాడు. ఇక మేము ఇంటికి పోతున్నాం జాగ్రత్తగా చూసుకో అని భైరవి చెబుతుంది. ఇక బామ్మ అరె నీకేం కాదు కానీ సత్యను చూడు ఎలా టెన్షన్ పడుతుందో జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది.
క్రిష్ చెయ్యిని పట్టుకొని సత్య ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావ్.. నాకు ముల్లు గుచ్చుకున్నట్లే ఉందని చెప్తుంది. తర్వాత రోజు సత్య సూప్ తెప్పిస్తుంది. అది క్రిష్ కు ఇస్తుంది. నాకు ఈ సూప్ నచ్చలేదు. అవునా ఇంకొకటి తెప్పించనా అని సత్య అంటుంది. ఏది తెపించిన అంతే ఉంటుంది. ఇచ్చే వాళ్ల మోహం నవ్వుతూ ఉండకుంటే ఎలా ఉంటుంది అని అంటాడు. ఇక నందినిని హర్ష వాళ్ల అమ్మ పొగుడుతుంది. అంతలోపే కాల్ వస్తుంది. క్రిష్ హాస్పిటల్ లో ఉన్నట్లు. దానికి నందిని మామా ఏమైంది అంటాడు. అన్నయ్యకు కత్తి పోటు పడిందని చెబుతుంది. అందరు టెన్షన్ పడతారు. హాస్పిటల్ కు వెళ్లి చూసి రమ్మంటే వెళ్తారు. అన్నయ్య ఎలా ఉంది. వదినకు అలవాటు లేదు కదా అని ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ వస్తాడు. ఎలా ఉంది అని అడిగితే ఇక్కడ కట్టేసినట్లు ఉంది.. అంటే అవునా అయితే నిన్ను ఈరోజే పంపిస్తాను అంటాడు.
ఇక భైరవి లడ్డు తీసుకొని వస్తుంది. పనిమనిషికి ఇస్తే వద్దమ్మా అంటుంది. అవి వేరేవి లే అని చెబుతుంది. శోభనం ఆగిపోయిన ఆనందంలో ఉన్నాను అంటుంది. దానికి పనిమనిషి అవునమ్మా అయ్యగారిని చంపాలని అనుకున్నారుగా భయం లేదా.. భయపడితే రోజూ భయ పడాలి అంటుంది. అంతలేకే క్రిష్ వాళ్లు వస్తారు. చిన్నోడు వచ్చాడు దిష్టికి రెడీ చెయ్యమని చెబుతుంది. క్రిష్ నాకు ఎర్ర నీళ్లు కాదు బాపు మీద ఆటాక్ జరిగిన వాడి నెత్తురు తో తియ్యాలి అంటాడు. ముందు ఇది కానీ అంటుంది భైరవి.. లోపలికి రాగానే మహదేవయ్య ఏమంటుంది మి పెళ్ళాం అంటాడు. ఏమైంది అని క్రిష్ అంటాడు. నీకు ఏదో అయిపోయిందని మామీద చిందులు తొక్కింది. అంటే ఏమైంది అని అంటాడు. నా భాద బయటకు చెప్పాను అంటుంది. ఇక నా ప్రాణం ఉన్నంతవరకు నా నాయనకు ఏమి కాదు. నా ప్రాణం అడ్డువేసి కాపాడుకుంటాను అని చెప్తాడు. ఇక భైరవి నా కొడుకును దగ్గరుండి చూసుకో.. టైం కు మందులు ఇవ్వాలి అని అంటుంది. భర్తను ఎలా చూసుకోవాలో సత్యకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా తనకు తెలుసు అంటాడు.. ఇక గదిలోకి తీసుకెళ్తుంది సత్య.. ఆ తర్వాత ఏమైంది సంపంగి నాతో ఉండటం లేదు. కనీసం నా మోహం చూడటట్లేదు. కోపం వచ్చిందా అంటాడు. దానికి సత్య మి నాన్న గురించి అనుకున్నా నా గురించి కూడా ఆలోచిస్తున్నావా అంటూ ఎమోషనల్ అవుతుంది. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రుద్ర నే తనపై ఎటాక్ చేయించాడని తెలుసుకుంటాడు మహదేవయ్య.. ఆ తర్వాత ఏం చేస్తాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..