Mumbai Actress Kadambari Jatwani Meet Home Minister Anita: హోంమంత్రి అనితను ముంబై నటి కాదంబరి జత్వానీ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ముంబైనటిని వేధించిన కేసులో ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. కాదంబరీ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని జత్వానీ ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు, సినీ రాజకీయ వర్గాల్లో ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఓ పారిశ్రామికవేత్త కోసం వైసీపీ నేతలు, అధికారులు కూడపలుక్కుని నటి కాదంబరి జత్వానీని వేధించిన వ్యవహారం అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. మనుషులు ఎవరైనా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా.. అంటూ వైసీపీ నేతలను, అధికారుల తీరును ప్రజలు అసంహ్యించుకుంటున్నారు.
ఈ వ్యవహారంలో ఐపీఎస్లు ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణను ఆదేశిచింది. ఇక తాజాగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నాటీ సీఎం కార్యాలంలో ఇద్దరు వ్యక్తులను కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు సకల శాఖల మంత్రిగా పేరొందిన వ్యక్తి కాగా.. సీఎం కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని తానై వ్యవహరించిన ఐపీఎస్ అధికారి అని పోలీసులు తెలిపారు.
Also Read: ఇంట్లో కుంపటి.. జగన్కు ఇక ఝలక్ల మీద ఝలక్లే, ఎందుకంటే?
ఇక ఇటీవల ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. కాదంబరి జత్వాని కేసులో ఎవరి పాత్ర ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసును చట్టబద్దంగా దర్యాప్తు జరుగుతుందని .. సరైన ఆధారాలు నిరూపించడం వల్లే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశామని ఆమె పేర్కొన్నారు.