Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం నెలకొన్న కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుందని రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. కాంగ్రెస్లో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు సాధారణమే అని వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు.
సీనియర్ నేతలు తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. కమిటీపై ఏదైన అభ్యంతరాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఇలా బజారుకు ఎక్కడం ఏమాత్రం బాగలేదు అంటున్నారు నేతలు.