New Excise Policy: అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేస్తామంటూ మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్నది. నూతన మద్యం పాలసీ విదానంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా, కొత్త పాలసీపై మంత్రులు తమ అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఈ కొత్త పాలసీపై పలు సూచనలు, మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. ప్రతి ఇంటికీ రూ. 25 వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం
సమావేశం అనంతరం మంత్రి వర్గ ఉపసంఘం మీడియాతో మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీని అమలు అవుతుంది. 6 రాష్ట్రాల్లో అమ్మకాలను పరిశీలించాం. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తాం. కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందు పెడుతాం. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచింది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం’ అంటూ కేబినెట్ సబ్ కమిటీ పేర్కొన్నది.
Also Read: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!