Narendra Modi : గతంలో సుధీర్ఘ కాలం పాలించిన పార్టీలు… ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు చేశాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తాము పవిత్రమైన ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చామని తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే తమ ఉద్దేశమని చెప్పారు. సరిహద్దులు, విభేదాల్ని తొలగించి, అభివృద్ధి పేరుతో వారధి నిర్మిస్తున్నామని మోదీ అన్నారు. మేఘాలయలోని షిల్లాంగ్లో ప్రధాని మోదీ 2450 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల్ని ప్రధాని ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ…. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.