EPAPER

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

PM Modi: ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టడమే తమ ధ్యేయమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి అనుగుణంగా కోట్లాది మంది భారతీయులు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది మా కార్యచరణగా చెప్పుకొచ్చారు.


కేంద్రంలో మూడోసారి మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో తీసుకున్న ప్రణాళికకు సంబంధించి ట్రైలర్ కనిపిస్తుందన్నారు. సోమవారం గుజరాత్‌లో జరుగుతున్న కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధర్యంలో జరుగుతున్న నాలుగో గ్లోబర్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల సదస్సు హాజరయ్యారు. మూడురోజులపాటు జరుగుతున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శాతాబ్దానికి భారత్ అత్యుత్తమ దేశంగా ఉంటుందని భారతీయులేకాదు, ప్రపంచం మొత్తం భావిస్తోందన్నారు. డైవర్సిటీ, స్థాయి, సామర్థ్యం, పనితీరు ప్రత్యేకమైనవి గా చెప్పుకొచ్చారు. రాబోయే వెయ్యేళ్లకు పునాది వేస్తోందన్నారు. ఉన్నత స్థాయికి చేరడం కాదని, అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయమన్నారు.


అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు తన శక్తి సామర్థ్యాలు భారత్‌కు తెలుసన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు ప్రధాని నరేంద్రమోదీ. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, యూపీ రాష్ట్రాలు ఈ సదస్సు భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి.

ALSO READ: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీతో కలిసి మాట్లాడారాయన. ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు సానుకూల వాతావారణ ఉండాలన్నారు. ఇలాంటి సదస్సు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు సీఎం చంద్రబాబు.

 

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×