Khammam : ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నారు. అది కూడా రౌడీల్లా నడిరోడ్డుపైనే కర్రలు, రాడ్లతో దాడి చేస్తున్నారు స్టూడెంట్స్. ఈ ఘర్షణలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మధ్య ర్యాగింగ్ చిచ్చుపెట్టింది. దీంతో సీనియర్స్, జూనియర్స్ను చుట్టుముట్టి కర్రలతో దాడి చేసారు. అందరు అందరు చూస్తుండగానే రోడ్డుపై కొట్టారు. సీసీఫుటేజ్లో విజువల్స్ రికార్డు అయ్యాయి.
ఘర్షణలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మనవడు సాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయి తండ్రి ఖమ్మం నగరంలో కార్పొరేటర్. కాలేజీలో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.